Monday, April 29, 2024

స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల‌పై ఏసీబీ దాడులు.. డాక్యుమెంట్ రైట‌ర్ల‌తో అక్ర‌మ దందా!

కర్నూలు జిల్లా కేంద్రంలోని కల్లూరు, కర్నూలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై బుధవారం మధ్యాహ్నం ఏసీబీ దాడులు చేప‌ట్టింది. దళారుల ప్రమేయంతో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు కూడా ముడుపులు ముట్టజెబుతున్నారన్న ఫిర్యాదులతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అవినీతి రహిత పారదర్శక పాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్ కార్యాలయ‌ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ఈ దందా నిర్వహిస్తున్నార‌న్న‌ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement