Friday, May 10, 2024

Breaking | ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. శ్రీ‌కాకుళం జిల్లాలో ఘ‌ట‌న‌

శ్రీ‌కాకుళం జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కవిటి మండలం జాడుపూడి పెట్రోల్ బంక్ సమీపంలో హైవేపై ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. జోరుగా వర్షం కురుస్తున్న వేళ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇచ్చాపురం మండలం కేశపురం గ్రామానికి చెందిన బొమ్మాలి జయంతి అక్కడికక్కడే చ‌నిపోయారు. త‌న కుమారుడిని మందస మండలం కుంటికోట హాస్టల్‌లో జాయిన్ చేసి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement