Thursday, April 18, 2024

శ్రీశైలం ఘాట్‌లో విరిగిపడిన కొండచరియలు

ఒంగోలు, ప్రభ న్యూస్ బ్యూరో : ఏపీలోని ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. గురువారం తెల్లవారుజాము నుంచి విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు స్వల్పంగా విరిగిపడ్డాయి. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో ప్రయాణికులు లేక పోవడం తో ప్రమాదం తపోయింది. ఈ ఘాట్ రోడ్డు ద్వారా ప్రతిరోజూ శ్రీశైలానికి వందల సంఖ్యలో వాహనాల్లో భక్తులు వెళ్తుంటారు. దీంతో ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడి ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement