Friday, May 3, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 27 కోట్ల డైమండ్ వాచీ స్వాధీనం.. గుజరాత్​ వ్యాపారికి అమ్మేందుకు తెచ్చిన స్మగ్లర్లు

దుబాయ్ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఓ వ్య‌క్తి నుంచి ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు అత్యంత విలువైన వాచీని స్వాధీనం చేసుకున్నారు. ఆ వాచ్ విలువ దాదాపు 27 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. దుబాయ్ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఆ ప్ర‌యాణికుడిని అరెస్టు చేశారు. ఇంకా అత‌ని నుంచి మొత్తం ఏడు ఖ‌రీదైన వాచ్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో జాక‌బ్ అండ్ కో కంపెనీకి చెందిన వాచ్ విలువ ఒక్క దానికే 27 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు.

ఇంకా ఐదు రోలెక్స్‌, ఒక పియాజెట్ వాచ్‌ల విలువ మొత్తం మ‌రో కోటి రూపాయ‌లు ఉంటుంది. ఓ గుజ‌రాతీ వీవీఐపీకి అమ్మేందుకు స్మ‌గ్ల‌ర్లు వీటిని తీసుకొచ్చిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్య‌క్తి పేరు బ‌య‌ట‌పెట్టేందుకు స్మ‌గ్ల‌ర్ భ‌య‌ప‌డుతున్నాడు. అత‌ని పేరు చెబితే త‌న ప్రాణాల‌కే ప్ర‌మాదం ఉంటుంద‌ని వెల్ల‌డించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement