Tuesday, May 14, 2024

Velugodu: కొడుకును చంపిన తండ్రి

వెలుగోడు, జూన్ 25, ఆంధ్రప్రభ న్యూస్ : వెలుగోడు పట్టణ ఎస్సీ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో మారెమ్మ గుడి దగ్గర రామకృష్ణ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే రామకృష్ణ మద్యానికి బానిసై ప్రతిరోజు తల్లిదండ్రులతో పాటు భార్యను వేధింపులకు గురి చేసేవాడు.

అదే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రామకృష్ణకు తండ్రి, తల్లిల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి నారాయణ రోకలిబండతో రామకృష్ణ తలపై కొట్టడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వెలుగోడు ఎస్సై జగన్మోహన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement