Monday, May 6, 2024

టిప్పర్ ను ఢీకొన్న కారు.. అక్క‌డిక‌క్క‌డే ఒకరు మృతి

సింగరాయకొండ ( ప్రభ న్యూస్) : ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ సమీపంలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం చెందిన షేక్ హఫీజ్ తో పాటు మరో ఇద్దరు కారులో వస్తున్న సమయంలో సింగరాయకొండ సమీపంలోని కనుమల్ల ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

- Advertisement -

రామాయపట్నం వెళ్తున్న టిప్పర్ ని కారు ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న‌ హఫీజ్ అక్కడికక్కడే చ‌నిపోయాడు. మ‌రో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన హఫీజ్ కార్ డ్రైవర్ కం ఓనరు. ఈ ఘ‌ట‌న‌లో కారు నుజ్జు నుజ్జయింది. సంఘటనా స్థలాన్ని సింగరాయకొండ సీఐ ప‌రిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement