Sunday, May 19, 2024

రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్.. 8 మంది విద్యార్థినులకు అస్వస్థత

శ్రీకాకుళం జిల్లాలోని మందస ఏపీ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు ఎనిమిది మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు. దంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గత రాత్రి భోజనం తర్వాత స్టూడెంట్స్ కళ్లు తిరిగి పడిపోయారు. జ్వరం, వాంతులు, విరోచనాలతో విద్యార్థినులు బాధపడుతున్నారు. అయితే కలుషిత ఆహారమే కారణమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థినిల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement