Friday, April 26, 2024

కదిరి ఘటన: ఆరుగురు మృతి.. ఎనిమిది మంది సేఫ్

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో భవనాలు కూలిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన 8 మందిని చికిత్స కోసం కదిరి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిథిలాల తొలగింపు కొనసాగుతోంది.

కాగా, భారీ వర్షాల కారణంగా కదిరి పట్టనంలోని చైర్మన్ వీధిలో ఈరోజు(శ‌నివారం) తెల్లవారుజామున దాదాపు 4 గంటల‌ సమయంలో భవనాలు కూలిపోయాయి. అంతా నిద్రలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్క‌సారిగా రెండు బిల్డింగులు కుప్ప‌కూల‌డంతో నిద్ర‌లో ఉన్న‌వారు ఆ భ‌వ‌న శిథిలాల కొంద చిక్కుకుపోయారు.  శిథిలాలను పోలీసులు, రెస్క్యూ టీం యుద్ధ ప్రాతిపదికన తొల‌గించే చేశారు. శిథిలాల తొల‌గింపులో ఇద్దరు చిన్నారుల మృత‌దేహాలు బయటకు తీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement