Tuesday, April 30, 2024

Breaking: అల్లూరి జిల్లాలో 500 కిలోల గంజాయి స్వాధీనం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో మరో గంజాయి ముఠా గుట్టు రట్టయ్యింది. సమీప రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో అల్లూరి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ప్రధాన రహదారులపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ చెక్‌పోస్టు దగ్గర అనుమానం వచ్చి ఓ కారును తనిఖీ చేయగా.. అందులో 500 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు విచారించగా.. ఆ డంప్‌ను ఒడిశా నుంచి రాజస్థాన్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కారును సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement