Friday, April 26, 2024

తలనీలాల ఈ-వేలంలో టీటీడీకి రూ.48 కోట్ల ఆదాయం

తిరుమల ప్రభన్యూస్‌: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం దేశవిదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ మొక్కుల చెల్లింపులో భాగంగా తలనీలాలు సమర్పిస్తుంటారు. కాగా ఈ తలనీలాలను గురువారం టిటిడి ఈ- వేలం నిర్వహించగా రూ.47.92 కోట్ల రూపాయలు టిటిడి ఆదాయం లభించింది. ఇందులో 21,100 కిలోలను ఈ-వేలంలో ఉంచగా అన్ని రకాలు అమ్ముడు పోయి రూ.48 కోట్లు ఆదాయం లభించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement