Monday, April 29, 2024

విహారయాత్రలో విషాదం.. సముద్రంలో అలలకు ఇద్దరు బలి, మరో ఇద్దరు గల్లంతు

విశాఖపట్నంలోని ఆర్‌.కె.బీచ్‌లో విషాదం జరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో విశాఖ నగరాన్ని తిలకించడానికి వచ్చిన నలుగురు సముద్రంలో గల్లంతయ్యారు. రెండు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. మృతి చెందిన వారిలో ఓ యువతి ఉంది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంవత్సర వేడుకులు జరుపుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన శివకుమార్‌, కోట శివ, ఎండీ అజిష్‌ సహా ఎనిమిది మంది స్నేహితులు గత నెల 30న విశాఖ వచ్చారు. వీరు ఆదివారం మధ్యాహ్నం ఆర్‌.కె.బీచ్‌లో స్నానాలకు దిగారు. ఇంతలో పెద్ద కెరటం రావడంతో శివ కుమార్, శివ, అజిష్‌ గల్లంతయ్యారు. మిగిలిన వారు సురక్షితంగా బయటపడ్డారు. కొంతసేపటికి శివకుమార్‌ మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. కోట శివ, అజిష్‌ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులు కోస్టుగార్డు, నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శివకుమార్‌ మృతదేహం వద్ద సహచరులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement