Friday, April 26, 2024

ఏపీలో కొత్త‌గా 3396 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌త కొన్ని రోజులుగా క‌రోనా కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3396 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 23,00,765 కి పెరిగింది. కోవిడ్ వల్ల అనంతపురము, నెల్లూరు, ప్రకాశంలలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, కర్నూలు లో ఒక్కొక్క రు చొప్పున మరణించారు.
దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,655 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,746 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 13,005 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 22,07,364 లక్షలకు చేరింది. ఇప్పటి దాకా 3,26,32,089 కరోనా పరీక్షలు చేసినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement