Sunday, April 28, 2024

Breaking: మూంగ్ దాల్ తిని.. 27మంది విద్యార్థులకు అస్వస్థత

మూంగ్ దాల్ తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లా ఎనుముల పల్లిలో కలకలం చోటుచేసుకుంది. ట్రస్ట్ ద్వారా నడపబడే వాసవి స్కూల్ లో మూంగ్ దాల్ (moong dal) తిని కళ్ళు తిరిగి 27 మంది విద్యార్థులు పడిపోయారు. స్కూల్ సమీపంలో పొగ ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారని స్కూల్ టీచర్లు అంటున్నారు. అయితే కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్కూల్ టీచర్లు తరలించారు. పోలీసులు, అధికారులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement