Friday, May 17, 2024

Breaking: తూఫాన్ వాహనం బోల్తా.. 11 మందికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నూలు నుంచి నంద్యాలకు వస్తున్న తూఫాన్ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఓర్వకల్ మండలం సోమయాజుల పల్లె ఘాట్ రోడ్డు వద్దకు రాగానే వాహనం టైర్ పగిలిపోయింది. దీంతో తూఫాన్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఉపాధ్యాయులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement