Sunday, May 5, 2024

తిరుమలేశుని నిత్య దీపాలు

పరమాత్మకై ఒక భక్తుని హృదయంలో వున్న కాంతి ఎన్న టికీ కొడిగట్టదు. అలాగే తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆల యంలోని గర్భగుడిలో వెలుగుతూ ఉండే మట్టి దీపాలు అఖండంగా అలా వెలుగుతూనే వున్నాయి. అనేక సంవ త్సరాల నుంచి అలా వెలుగుతున్న దీపాల వెనుక వున్న రహస్యాలను గురించి తెలుసుకుందాం.
నేడు తిరుమల శ్రీనివాసాలయం సిరిసంపదలకు నిల యం. భోగభాగ్యాలతో అలరారుతోంది. వార్షిక ఆదాయం వేల కోట్లలో వుంటుంది. బ్యాంకుల్లో శ్రీవారికి చెందిన టన్నుల కొద్దీ బంగారం గుట్టగా పోగయింది.
వేల కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంకుల్లో మూలు గుతున్నాయి. ఎక్కడెక్కడో భూములు, మిద్దెలు మేడలు శ్రీవారి సొంతం. ఇంతటి భాగ్యవంతుడు అయిన శ్రీవారికి ఒకప్పుడు డబ్బు… బంగారం… భూములు… ఇలాంటి సం పదలు లేవు. అప్పట్లో శ్రీవారి సంపదంతా ఆవుల మందలే!
ఆ మందలే స్వామివారి ఆలయంలో దీపారాధనకు ఆధారమయ్యాయి. అప్పట్లో శ్రీవారి ఆలయంలో దీపం వెలిగించడానికే ఇబ్బందిపడ్డారు. దీపం వెలిగించడం కోస మే విరాళాలు స్వీకరించేవారు. ఇలా స్వీకరించిన విరాళాల లో ఆవుల మందలే ప్రధానంగా ఉండేవి. ఆలయంలో ఒక నేతిదీపం వెలిగించాలంటే 32 ఆవులు, ఒక ఆబోతు స్వామి వారికి కట్నంగా స్వీకరించేవారట. ధనవంతులైతే 40 కొలంజుల బంగారం ఇచ్చేవారట! ఇది ఒక పద్ధతిగా ఆనాడు నిర్దేశించుకున్నారు.
శ్రీవారి ఆలయంలో క్రీ.శ. 830లో అప్పటి రాజులు ‘నందవిళక్కు’ అంటే ‘వెలుగుతున్న దీపం’ అనే పేరుతో నిత్యం నేతిదీపం వెలిగించే పద్ధతికి శ్రీకారం చుట్టా రట. శాసనాల్లో చాలాచోట్ల వెలుగుతున్న దీపం ప్రస్తావన వుంది. దీపాలను వెలిగించడా నికి ఎవరెవరు విరాళాలు ఇచ్చిందీ శాసనాల్లో రాశారు. దీపాలను వెలిగించడానికి విరాళంగా వచ్చి న ఆవులను పోషించడానికి అవసరమైన గడ్డి పెంపకం కోసం భూములు విరాళంగా ఇచ్చిన రాజులున్నారు. బంగారాన్ని శ్రీవారి భాండాగారానికి జమ చేసిన విధాన మూ ఆనాడు అమల్లో వుంది.
క్రీ.శ. 905 నుంచి క్రీ.శ. 953 దాకా ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి పరాంతక చోళుడైన పరాకేశరి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో రెండు నేతి దీపాలు వెలి గించడం కోసం ఒక్కో దీపానికి 40 కొలంజుల బంగారం దానం చేశారు. తెలుగు పల్లవ రాజులలో అత్యంత ముఖ్యు డైన విజయగండ గోపాలుని పట్టపురాణి దేవర సియార్‌ తిరుమల శ్రీవారి సన్నిధిలో 3 దీపాలు వెలిగించడానికి 32 ఆవులు, ఒక ఆబోతు, బంగారం దానం చేశారు. యాదవ రాజులలో అత్యంత పరాక్రమవంతునిగా పేరుగాంచిన వీర నరసింగదేవ యాదవరాయలు గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యం దీపారాధన కోసం 32 గోవులను, ఒక ఎద్దు ను దానం చేశారు. అలాగే తిరుమల ఆలయానికీ 32 ఆవులు, ఒక ఆబోతు దానం చేశారు. ఇలా శాసనాల్లో పలుచోట్ల శ్రీవారికి గోదానం చేసిన ఉదంతాలు కనిపిస్తా యి. గోవులను పోషించడం, వాటిద్వా రా వచ్చే పాల నుం చి వెన్నను, దాని నుంచి నెయ్యిని సేకరిం చి దాంతో దీపాలు వెలిగించడమనేది ఒక పద్ధతిగా సాగింది. అందుకే శ్రీవారి తొలి సంపద ఆవుల మందలే అయ్యాయి. ఈ లెక్కన అప్ప ట్లో శ్రీవారికి ఎన్ని వేల ఆవులు ఆస్తిగా ఉండేవో అనిపిస్తుంది. ఇప్పటికీ స్వామి వారికి ఆవులను కానుకగా ఇచ్చే సంప్ర దాయం కొనసాగుతోంది. తిరుమల, తిరుపతిలోని టిటిడి గోశాలలో ఉన్నవలా వచ్చిన ఆవులే!

Advertisement

తాజా వార్తలు

Advertisement