Wednesday, May 1, 2024

Smuggling – అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న35 ట‌న్నులు స‌న్న బియ్యం లారీ సీజ్

నిజామాబాద్ రూరల్ ఫిబ్రవరి5 ప్రభ న్యూస్ – ఆంధ్ర నుండి నిజామాబాద్ కు బియ్యం త‌ర‌లిస్తున్న ఏ పి 39 యూ 5287 నెంబర్ లారీని సివిల్ సప్లై అదికారులు పట్టుకున్నారు.. జగ్గయ్య పేట నుండి వస్తున్నఈ లారీలో 35 టన్నుల సన్న బియ్యం ఉన్నాయి. ఖానా పూర్ శివారులోని రైస్ మిల్లులకు తరలిస్తున్న లారీకి ఎటువంటి ఫ‌ర్మిట్లు లేవ‌ని త‌నిఖీల‌లో గుర్తించారు.. బియ్యం ర‌వాణ‌కు సంబందించిన వేబిల్లులు కూడా లేక‌పోవ‌డంతో బియ్యంతో స‌హా లారీని సీజ్ చేసి రూర‌ల్ పోలీస్ స్టేష‌న్ ఎస్ ఐ మహేష్ స్వాధీనం చేశారు సివిల్ స‌ప్లై అధికారులు ..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement