Sunday, May 19, 2024

HYD: పెట్టుబడి పేరుతో రూ.6 కోట్లు మోసం.. ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌ : పెట్టుబడి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు, సిమ్‌కార్డులు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

వీరు పెట్టుబడి పేరుతో పేర్లతో రూ.6 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితులపై దేశ వ్యాప్తంగా 507 కేసులు, తెలంగాణలో 67 కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement