Saturday, April 20, 2024

భక్తులతో కిటకిటలాడిన చిన్న వెంకన్న ఆలయం..

ద్వారకా తిరుమల : చిన్న తిరుమలేశుని ‌సన్నిధి భక్తజన సంద్రంగా మారింది.దీంతో శేషాచలం ..గోవింద నామాలతో మారుమ్రోగింది.శ్రీవారికి ఇష్టమైన రోజు శనివారం కావటంతో క్షేత్రపరిసరాలు భక్తులతో నిండిపోయాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చే భక్తులను ఆలయ సిబ్బంది ముందుగా శానిటైజర్ తో చేతులను శుభ్రపరిచి, ధర్మల్ స్కానర్ ద్వారా ఉష్ణోగ్రతను పరీక్షించి, దర్శనానికి అనుమతిస్తున్నారు. రెండో శనివారం సెలవు దినం కావడంతో భక్తుల రాక ఆలయానికి గణనీయంగా పెరిగింది.దీంతో వేలాదిగా తరలివచ్చిన భక్తులతోనూ వారి వాహనాలతో శేషాచల ఘాట్ రోడ్డు కిటకిటలాడింది.అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. కేశఖండన శాల, ప్రసాదాల కౌంటర్ లు, క్యూ కాంప్లెక్స్ లు, భక్తులతో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో జీ వి సుబ్బారెడ్డి పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement