Monday, April 29, 2024

ఇంకెప్పుడు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది?

కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి, కరోనా బారిన పడిన వారికి ఊరట కలిగించాలని వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. ఇంకెప్పుడు సీఎం సారు.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది? అని ప్రశ్నించారు. ప్రతి 100 మందిలో 10 మందికి కరోనా వస్తోందన్నారు. ఆ 10 మందిలో 9 మంది పెద్దవాళ్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని, కరోనా బారిన పడిన వారికి ఊరట కలిగించాలని కోరారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడాలని షర్మిల తెలిపారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement