Saturday, May 4, 2024

KHM: మనస్థాపంతో యువతి ఆత్మహత్య..

పినపాక, జనవరి 23 (ప్రభ న్యూస్): మనస్థాపంతో యువతి పురుగుల‌ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని మద్దులగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పర్శిక శైలజ (19) నర్సింగ్ చదువుతుంది.

శైలజను తమ ఇంటి పొరుగు వారైన‌ మహిళలు తిట్టారనే నెపంతో మనస్థాపానికి గురై అవమానం తట్టుకోలేక ఇవాళ‌ ఉదయం ఇంట్లో‌ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి ఏడూళ్ళ బయ్యారం పోలీసు స్టేషను లో పిర్యాదు చేసినట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement