Saturday, April 20, 2024

హైద‌రాబాద్ కి మ‌రో మూడు రోజులు వ‌ర్ష సూచ‌న‌లు-ఎల్లో అల‌ర్ట్

బంగాళాఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో కొన్ని చోట్ల భారీనుంచి అతి భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. దాంతో తెలంగాణ‌లో మ‌రోసారి వ‌ర్షాలు ప్ర‌జ‌లను ఇబ్బంది పెట్ట‌నున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నావేసింది మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైద‌రాబాద్‌కు ఎల్లో అల‌ర్ట్ జారీ చేసింది. రాజ‌ధాని న‌గ‌రంలో రెండు రోజుల నుంచి వ‌ర్షాలు కుర‌స్తున్నాయి. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో కూడా గురువారం వ‌ర్షం కురిసింది. వివిధ ప్రాంతాల్లో పిడుగులు ప‌డి నలుగురు చ‌నిపోయారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ఈదమ్మబండ తండాలో పిడుగు పాటుకు ఇద్ద‌రు మృతి చెందారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కన్నాయపల్లిలో పిడుగుపడి అలాట చంద్రమౌళి అనే వ్యక్తి చనిపోయాడు. అతని రెండు ఎడ్లు కూడా చనిపోయాయి. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని చందారం శివారులో పిడుగుపటుకు కొమ్ము సత్తన్న అనే ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement