Friday, May 3, 2024

Xth Class విద్యార్ధుల అల్పాహారం కోసం నెల జీతం విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మార్చి నెలలో జరగనున్న పదవతరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులలో వారికి ప్రోత్సాహకరంగా ఉండేలా సాయంత్రం పూట అల్పాహారం అందించడం కోసం చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం నుండి ఒక లక్షా యాభై వేల రూపాయలు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ శాతం పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే ఉంటారని, సాయంత్రం పూట నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులలో వారి ఆకలి తీర్చాలని తద్వారా వారు చదువుపై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. తన బాల్యంలో ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నానని భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సేవలు అందించే విషయంలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement