Sunday, May 5, 2024

Shocking News: రామంతపూర్‌లో దారుణం.. ఆస్తీకోసం క‌న్న‌త‌ల్లినే క‌డ‌తేర్చాడు…

ఆస్తికోసం క‌న్న‌త‌ల్లినే క‌డ‌తేర్చాడు కుమారుడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని రామంతపూర్‌లో చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లిని, భార్యతో కలిసి హత్య చేశాడు కొడుకు అనిల్.

అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలోనే… ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు పోలీసులు.

అనంతరం హత్య చేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. రామంతపూర్ లో సుగుణమ్మ, కొడుకు అనిల్ కోడలు తిరుమల నివాసం ఉంటున్నారు. సుగుణమ్మ పేరు మీద ఇల్లు ఉండడంతో ఆ ఇల్లును అమ్మాలని చూశారు కొడుకు, కోడలు. కానీ సుగుణమ్మ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోకపోవడంతో భార్య, తన స్నేహితుడితో కలిసి తల్లి సుగుణమ్మను హత్య చేశాడు కొడుకు అనిల్‌. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement