Monday, May 6, 2024

KHM: 30రోజులు కష్టపడండి… 30ఏళ్లు గుర్తుండేలా అభివృద్ధి చేస్తా.. రేగా కాంతారావు

30రోజులు కష్టపడండి… 30ఏళ్లు గుర్తుండేలా అభివృద్ధి చేసి చూపిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రేగా కాంతారావు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ…. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటానని తెలియజేశారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో దేశానికే మార్గదర్శిగా నిలిచిందన్నారు. నిరంతర విద్యుత్, రైతుబంధు, సాగునీళ్ళతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీర్చబడిందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలందరూ మరోసారి బలపరచాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు… చేసేది లేదు.. వాళ్ళు బూటకపు మాటలు నమ్మకండి.. అభివృద్ధిని వెనక్కి నెట్టకండి.. పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూడండి.. వార్డుని కూడా అభివృద్ధి చేయలేని వారు నియోజకవర్గానికి ఏం చేస్తారు, అందుకే విజ్ఞానులైన నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలి.. 24 గంటలు మీ అందరికీ అందుబాటులో ఉండి మీకోసం పనిచేస్తున్న తనను మరోసారి ఆశీర్వదించి.. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి, నియోజకవర్గంలోని ప్రజలందరి ఆకాంక్షలు నెరవేరుస్తానని ఆయన అన్నారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో అందరి మనసులను హత్తుకునే విధంగా ఉందన్నారు. కేసీఆర్ బీమా ప్రతి కుటుంబానికి ధీమాగా, అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు పెన్షన్ పెంపు, రైతుబంధు ఎకరాకి రూ.16,000లు, సన్నబియ్యం, అన్నపూర్ణ పథకం, మహిళలకు జీవన భృతి ఇచ్చే సౌభాగ్య లక్ష్మి 15 లక్షల వరకు, ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ వంటి మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండి ప్రజలందరి అభిమానాలు పొందుతున్నాయన్నారు.

- Advertisement -

ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కొనే దమ్ము లేకనే హత్యా రాజకీయాలకు తెరలేపిందని ఆయన అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలి, హత్యా రాజకీయాలు చేసి గెలవాలనుకోవడం చేతగాని తనానికి నిదర్శనమన్నారు. హత్యా రాజకీయాలు మానుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, మార్కెట్ యార్డ్ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కశాని శ్రీనివాసరావు, సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement