Sunday, May 5, 2024

Women reservation bill – ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెల్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ

మోత్కూర్,సెప్టెంబర్ 22 (ప్రభ న్యూస్) లోకసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టి అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ మలి దశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి ,బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకురాలు కాసోజు శంకరమ్మ శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా బిల్లు అమలు కోసం చేసిన పోరాటాల ఫలితమే నేడు మహిళా బిల్లు ఆమోదం పొందిందని అన్నారు.మహిళలు రాజాకీయంగా రాణించేందుకు 33 శాతం రిజర్వేషన్ లు ఎంతో దోహధపడ తాయన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజాకీయంగా ఎదిగి సమానత్వం సాదించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement