Saturday, May 11, 2024

పంజాగుట్ట శ్మశాన వాటికలో యువతి హల్చల్…ప్రియుడు మోసం చేశాడంటూ న్యూసెన్స్

హైదరాబాద్ – పంజాగుట్టలో గత అర్ధరాత్రి స్మశానంలో యువతి హల్చల్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పంజాగుట్ట స్మశాన వాటిక వద్ద అర్ధరాత్రి ఓ యువతి రెండు గంటలపాటు రచ్చ చేసింది. ఆ యువతి స్మశానంలో ఒక వ్యక్తిని ప్రేమించానని, అతను తనను వదిలేశాడని నానా న్యూసెన్సు చేసింది. ఏడుపులు, పెడబొబ్బలు పెట్టింది. అర్ధ రాత్రి పన్నెండు గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు గొడవ జరిగింది. తన ప్రియుడు తనను విడిచి పెట్టాడు అని స్మశానంలో కన్నీళ్లు పెట్టుకోవడం ప్రారంభించింది.

ఇక అర్ధరాత్రి స్మశానంలో యువతి ఏడుస్తూ ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆమె వివరాలు తెలుసుకొని ఏమైంది అంటూ మొదట ప్రశ్నించారు. తనను ప్రేమించిన అబ్బాయి తనను మోసం చేశాడని, తనను వదిలి వెళ్లిపోయాడని పేర్కొన్న యువతి తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పింది. అతను లేని జీవితాన్ని ఊహించుకోలేనని పేర్కొంది. దీంతో ఆ యువతిని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించిన స్థానికులు, ఎంతసేపటికి యువతి వినకపోయేసరికి పోలీసులకు సమాచారం అందించారు .దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతిని స్మశానవాటిక నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక పోలీసులు యువతిని తీసుకు వెళ్ళడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement