Sunday, May 5, 2024

దేవ‌త చెప్పింది – ఆమె నిప్పంటించుకుంది…

హైదరాబాద్ – ఆధునిక‌యుగంలో కూడా మూడ‌న‌మ్మ‌కాలు కొన‌సాగుతున్నాయి… దేవ‌త చెప్పిందంటూ ఒక మ‌హిళ త‌న‌కు తానుగా నిప్పంటించుకుంది.. ఈ ఘ‌ట‌న రాజేంద్రనగర్ లో చోటు చేసుకుంది. వివరాల‌లోకి వెళితే అత్తాపూర్‌లో శివాని (35) బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తోంది. అయితే మంగళవారం ఉదయం ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన శివాని.. దేవ‌త చెప్పిందంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులే అమెకు అంటుకున్న మంట‌ల‌ను ఆర్పివేశారు.. అప్ప‌టికే ఆమె శ‌రీరం 40శాతం కాలిపోయింది.. ఎస్సై శ్వేత ఘటనాస్థలికి చేరుకుని శివానిని 108 వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement