Monday, May 6, 2024

TS | భార్య ఆత్మహత్య, భయంతో పురుగుల మందు తాగిన భర్త.. కుటుంబ కలహాలే కారణమా?

మణుగూరు/పినపాక (ప్రభన్యూస్​): కుటుంబ కలహాల కారణంగా భార్య ఆత్మహత్య చేసుకోగా, అది చూసి భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పినపాక మండలంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉప్పాక గ్రామనికి చెందిన కాలేవారు సాయి (28) 108లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బోటిగూడెం గ్రామనికి చెందిన కారం స్వప్న(26), మణుగూరు బిటిపియస్ లో జెపిఏగా ఉద్యోగం చేస్తుంది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కోద్ది రోజులుగా వీరి మధ్య కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. కాగా, బుధవారం స్వప్న యధావిధిగా బిటిపియస్ కు విధులు కు వెళ్ళింది. మధ్యహ్నం సమయంలో ఉప్పాక గ్రామంలోని అత్తగారి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు 108 ద్వారా చికిత్సా కోసం మణుగూరు ఏరియా అసుపత్రికి తరలించారు. వైద్య చికిత్సా నిర్వహించిన డాక్టర్లు అప్పటికే ఆమె చనిపోయినట్టు తెలిపారు. భార్య మృతితో భయానికి గురైన భర్త సాయి మణుగూరు పాత ఇసుక బంకర వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కొంతమంది పోలిసులకు సమాచారం అందించారు. వారు 108 ద్వారా మణుగూరు ఏరియా అసుపత్రికి తరలించారు. చికిత్స నిర్వహించిన డాక్టర్లు అతని పరిస్థితి విషమించందని, భద్రాచలం ఏరియా అసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపారు. కాగా, కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం 108ద్వారా భద్రాచలం ఏరియా అసుపత్రికి తరలించారు. మృతిరాలి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు ఏడూళ్ళ బయ్యారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement