Monday, April 29, 2024

TS: ఐటీ కట్టేవారికి రైతుబంధు ఎందుకు.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న..

ఇన్‌ కమ్‌ టాక్స్‌ కట్టేవారికి రైతుబంధు ఇవ్వొద్దన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతుబంధుపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్కమ్ టాక్స్ కట్టే వారికి, వందల ఎకరాల భూమి ఉన్నవారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసం. కేవలం సాగుచేసే వారికే రైతుబంధు ఇవ్వాలన్నారు. నిజమైన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం చేయాలన్నారు. రైతు భరోసా విధి విధానాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు.

కాగా నిన్నటి నుంచి రైతు బంధు నిధులు విడుదల అవుతున్నాయి. రైతు భరోసా విధివిధానాలు ఖరారు కాకపోవడంతో పాత పద్దతిలో ఎకరానికి 5 వేల రూపాయల పెట్టుబడి సాయం వేయాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇందులో కొంత మంది రైతులకు మాత్రమే రైతు బంధు పడింది. మరికొంత మంది రైతులకు పడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement