Monday, April 29, 2024

TS: పాలు ఉన్న చోట సంప‌ద.. డిప్యూటీ సిఎం భ‌ట్టి..

హైదరాబాద్ : రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో నేడు జ‌రిగిన 50వ పాడిపరిశ్రమ సదస్సు-2024ను జ్యోతి ప్రజ్వలన చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో క‌ల‌సి ప్రారంభించారు. ఈ సందర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామన్నారు. పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. పాలు ఉన్న చోటే సంపద ఉంటుందన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో పాడి ఉత్పత్తి ఒక భాగం అన్నారు. పాలు పొంగించి శుభాలు పొందాలన్నారు.

పాలు ఉన్న చోట సంపద ఉంటుందని తెలిపారు. పాడి ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు ఒక సంపద లాంటిదని.. తెలంగాణలో పాడి ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డెయిరీ పరిశ్రమ అభివృద్ధికి దోహద పడుతుందన్నారు. స్వయం సహాయక సంఘంలో ఉన్నమహిళలకు పాడి ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడానికి ఆర్థికంగా ప్రోత్సాహిస్తున్నామన్నారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి నేతృత్వంలో దేశంలో హరిత, శ్వేత విప్లవానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. వ్యవసాయం, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ ఈ వార్షిక బడ్జెట్లో పెద్దపీట వేశామ‌ని గుర్తు చేశారు.. రీజినల్ రింగ్ రోడ్ – ఔటర్ రింగ్ రోడ్డు మధ్యన డెయిరీ ఇండస్ట్రీ క్లస్టర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement