Sunday, May 5, 2024

NZB: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సామాజిక భద్రత చట్టం… ష‌బ్బీర్ అలీ

నిజామాబాద్ సిటీ, నవంబర్ 20 (ప్రభ న్యూస్) : శ్రమజీవులకు కనీస సామాజిక భద్రత కల్పించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాగానే సామాజిక భ‌ద్ర‌త చ‌ట్టం ఏర్పాటు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి మహ మ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అసం ఘటిత శ్రమజీవులకు బతుకు భద్రత లేదని సామాజిక భద్రత లేదని తెలిపారు. సోమవారం నిజామాబాద్ పట్టణం గంజ్ లో హమాలి సంఘం, గుమస్తా సంఘం సభ్యులతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ సమావేశమై ఎన్నికల్లో మద్దతు తెలిపాలని కోరారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ… ఉత్పత్తి పంపిణీ రంగాల్లో పనిచేస్తున్న హమాలి, గుమస్తా వర్కర్స్ సేవలు చాలా ముఖ్య మైనవన్నారు. వీరి సేవలు నిలిచిపోతే సరుకులు ఎక్కడిక‌క్కడే ఉండిపోతాయని, ప్రజల వద్దకు సరుకులు చేరకపోతే పరిస్థితులు తీవ్ర సంక్షోభంగా మారుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 600 రైస్ మిల్లులు, మార్కెట్, వ్యవసాయ, ఉత్పత్తుల ఎగుమతి దిగుమతుల్లో పట్టణ ప్రాంతాల్లో దుకాణాల్లో సివిల్ సప్లై ఎఫ్సీఐ గోడౌన్ ట్రాన్ ఫోర్ట్, పరిశ్రమల్లో లక్షల మంది హమాలీ, గుమస్తాలు పనిచేస్తున్నార‌న్నారు. వారిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారికి కార్మిక సామాజిక భద్రత చట్టం ఏర్పాటు చేసి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామ‌న్నారు. హమాలీ కార్మికులు, గుమస్తాలు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీనీ గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement