Sunday, April 28, 2024

Bhatti Vikramarka: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం..

రాష్ట ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం త్వరలో విడుదల చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గం ప్రజల ఆశీస్సులతో ఉన్నత పదవి చేపట్టానని తెలిపారు. మధిర ప్రజలందరి కృతజ్ఞతలు అన్నారు. ఈనెల 14 నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయన్నారు. చారిత్రాత్మక విజయం తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారని తెలిపారు.

గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనా అంత అస్తవ్యస్తమన్నారు. రాష్ట్ర సంపద అంతా దోపిడీ గురైందన్నారు. పూర్తిగా 10 ఏళ్ళల్లో రాష్ట్రం 70 ఏళ్ళు అభివృద్ధిలో వెనకబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయంలో ఫీడల్ వ్యవస్థ ఏర్పడిందన్నారు. ప్రభుత్వంలో ఉన్నా ప్రతి వ్యవస్థ ప్రజలకోసంమే పనిచేసేలా పాలనా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత రాజ్యంగ స్పూర్తితో పాలనా అందిస్తామని తెలిపారు. కుట్రపూరితమైన పాలనకు చరమగీతం పాడారని హర్షం వ్యక్తం చేశారు. మండల, జిల్లా స్థాయిలో ప్రజా దర్బార్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిస్కారం చేస్తామని తెలిపారు. రాష్ట ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం త్వరలో విడుదల చేస్తామని అన్నారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement