Thursday, April 25, 2024

జాతీయ స్థాయి త్రోబాల్ కు పూర్తి సహకారం అందిస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

జాతీయ స్థాయి త్రోబాల్ చాంపియన్ షిప్ ట్రోఫీకి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో 27వ జాతీయ త్రోబాల్ చాంపియన్ షిప్ వాల్ పోస్టర్, ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించారు. జాతీయ త్రోబాల్ చాంపియన్ షిప్‌ను సికింద్రాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ సఫీల్ గూడలో మే 28 నుంచి 30 వరకు నిర్వహిస్తున్నట్లు జాతీయ త్రోబాల్ అసోసియేషన్ నిర్వాహకులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, హ్యాండ్ బాల్ జాతీయ ఫెడరేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, త్రోబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నవీన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ గౌడ్, డీఏవీ స్కూల్ సౌత్ హెడ్ పార్తీబన్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement