Sunday, May 5, 2024

అపర భద్రాద్రిని దర్శించుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభమేళలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించిన అనంతరం శాలువాలతో సన్మానించి దేవుని చిత్రపటాన్ని ఆలయ నిర్వహణ అధికారి కందుల సుధాకర్ బహుకరించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి బల్మూర్ వెంకట్, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీ రాజయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement