Thursday, May 2, 2024

నిలిచిన కొనుగోళ్లు.. ఆందోళనకు దిగిన రైత‌న్న‌లు..

వరంగల్, వర్ధన్నపేట: పట్టణ కేంద్రంలో ఫిరంగిగడ్ ప్రాంత సమీపంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అర్ధాంతరంగా నిలిపివేశారు. ధాన్యం కొనుగోలు నిలిపివేయడంతో రైతన్నలు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై రామారావు సంఘటన స్థలానికి చేరుకుని కొనుగోలు కేంద్రం నిలిపివేయడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. దీంతో కొంత సమయం పాటు రైతులు ఆందోళన విరమించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement