Monday, April 29, 2024

TS: ప్రజల భద్రత పోలీసుల బాధ్యత.. ఎస్పీ చంద్రమోహన్

ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని మహబూబాబాద్ ఎస్పీ గుండేటి చంద్రమోహన్ తెలియజేశారు. ఇవాళ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ… ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 24గంటల పాటు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. ప్రజలు సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని, ప్రజలు అత్యవసరముంటే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ చంద్రమోహన్ కు జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement