Sunday, May 5, 2024

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి: ఎమ్మెల్యే రెడ్యానాయక్

రాష్ట్రం పాడి పంట‌ల‌తో స‌మృద్దిగా నిండాల‌ని.. ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో ఉండాల‌ని డోర్న‌క‌ల్ ఎమ్మెల్యే రెడ్యానాయ‌క్ ఆకాంక్షించారు. శుక్ర‌వారం జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మెన్ గుడిపూడి న‌వీన్ రావుతో క‌లిసి మ‌రిపెడ మండ‌లంలోని పురుషోత్త‌మ‌యగూడెంలో నూత‌నంగా నిర్మించిన అభ‌యాంజ‌నేయ ఆల‌య ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రై ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఆధ్యాత్మిక‌త‌తో మాన‌సిక సంతుల‌త క‌లుగుతుంద‌ని, ఆల‌యాలు భావి త‌రాల‌కు సంస్కృతి, సంప్రదాయాల‌కు ఆల‌వాలంగా నిలుస్తాయ‌న్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ యాదాద్రి ఆల‌యాన్ని యావ‌త్ ప్ర‌పంచం అబ్బుర ప‌రిచే విధంగా నిర్మించి భావి త‌రాల‌కు అందించార‌న్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement