Thursday, April 25, 2024

అనుమానాస్ప‌ద స్థితిలో వివాహిత మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో దారుణం చోటుచేసుకుంది. అనుమానాస్ప‌ద స్థితిలో వివాహిత మృతిచెందింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మండ‌లంలోని అక్కలచెడ గ్రామానికి చెందిన ఇస్లావతు త్రిష (22) ఆదివారం ఉదయం తమ ఇంటి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. త్రిష‌కు ఆరు నెల‌ల కూతురు ఉంది. మృతురాలి భర్త తిరుపతి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగి. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement