Thursday, April 18, 2024

విద్యుత్ స్తంభం విరిగి పడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి

సరఫరా లేని విద్యుత్ స్తంభం తొలగిస్తుండగా విరిగిపడి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. పెద్దపల్లి మండలం బంధం పల్లి గ్రామానికి చెందిన చిట్టవేన సంతోష్ (33) జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ నగర్ లో ఖాళీ స్థలంలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగిస్తుండగా విరిగిపడి సంతోష పై పడింది. ఈ ప్రమాదంలో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఎస్సై రాజేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement