Sunday, May 26, 2024

మాకు అన్నం పెట్టండి సారూ : అందని ‘మధ్యాహ్న భోజనం’… విద్యార్థులకు పస్తులు

గూడూరు : మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోని నాయకపల్లి గ్రామంలో ప్రాథమిక ఉన్న‌త పాఠశాల నాయకపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనం బంద్ చేసి సుమారు 15 రోజుల నుంచి విద్యార్థులు పస్తులతో ఉంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న ప్రభ న్యూస్ ప్రతినిధి పాఠశాలకు చేరుకొని విద్యార్థుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు ఒకటి నుండి మధ్యాహ్నం భోజనం వండే వర్కర్ సోమయ్య రావడం లేదని.. దీంతో గత 15 రోజుల నుండి పస్తులతో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి మధ్యాహ్న భోజనం అసలే పెట్టడం లేదని అర్దాకలతో ఉంటున్నామని ఇంటికాంచలి బాక్సులు తెచ్చుకొని తింటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మూడు రోజులు మాత్రం ఉపాధ్యాయులు వండి పెట్టారని విద్యార్థులు తెలిపారు. ఉన్నతాధికారులు మా సమస్యను పరిష్కరించి మాకు మధ్యాహ్న భోజనం అందించే విధంగా కృషి చేయాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement