Friday, May 3, 2024

మదినిండా దేశభక్తి.. జాతీయ గీతాలాపనతో పులకించిన భారతావని

భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 75 ఏళ్ల స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మదినిండా దేశభక్తితో ఉదయం 11.30 గంటలకు జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, కార్మికులు సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్క‌ర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి, పాఠశాల, కళాశాల విద్యార్థులు, కార్మిక, ప్రజా, వివిధ సంఘాలు, ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో అధికారులు, సిబ్బంది ఎక్కడివారు అక్కడే నిలబడి జాతీయ గీతం జనగణమన గీతపాలన చేశారు. అదేవిధంగా జయశంకర్ జిల్లాలోని 11 మండలాల్లోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు ప్రధాన రహదారులపై ర్యాలీగా వచ్చి జాతీయ గీతాలాపనలో పాల్గొని జాతీయ సమైక్యతను చాటి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement