Friday, May 3, 2024

రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారులో డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 550 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ప్రాధమిక అంచనా. బలిమెల నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు ఉన్నారని, మరో నలుగురు నిందితులు పరారైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement