Saturday, April 27, 2024

కారు బోల్తా… ఐదుగురికి గాయాలు

వాజేడు : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చికుపల్లి బొగత జలపాతాన్ని సందర్శించి వెళుతున్న కారు మండల పరిధిలోని దూలాపురం గ్రామం వద్ద కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాదుకు నుంచి వ‌చ్చి బొగత జలపాతాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో ఈ ఘ‌ట‌న చేటుచేసుకుంది. ప్రమాదానికి గురైన క్షతగాత్రులను వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement