Monday, May 6, 2024

సహాయ కార్యక్రమాల్లో ఎర్రబెల్లి.. హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాల పంపిణీ

రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. వరంగల్ – మామునూరు హెలీ ప్యాడ్ నుండి ఏటూరు నాగారం – కొండాయిలో వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఆహార పొట్లాలు, నీరు, మందులను స్వయంగా దగ్గరుండి పంపిణీ చేశారు. హెలికాప్టర్ ద్వారా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అలాగే భద్రాచలం ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఆందోళన చెందుతున్న బాధితుల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ ను, రెస్క్యూ టీం లను, ఆహార, నీటి పొట్లాలను దగ్గరుండి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement