Monday, April 29, 2024

CM KCR : ఇవాళ వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్, గజ్వేల్ ప్ర‌జాఆశీర్వ‌ద స‌భ‌లు

ఇవాళ్టితో తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సీఎం కేసీఆర్ మూడు ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు. ముందుగా వ‌రంగ‌ల్ ఈస్ట్, వ‌రంగ‌ల్‌వెస్ట్ ల‌లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం ముగించుకుంటారు. అనంత‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లో సాయంత్రం ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు.

ప్ర‌చారం చివ‌రి రోజు కావ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ ప్ర‌సంగం ఎలా ఉంటుందోన‌ని ఉత్సాహాంతో ఎదురుచూస్తున్నారు. అలాగే స‌భ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను ఇప్ప‌టికే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశారు. అటు పోలీసులు కూడా భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement