Sunday, May 5, 2024

తమ్ముడు ఈటల రాజేందర్ మంచి నిర్ణయం తీసుకున్నారు: విజయశాంతి

టీఆర్ఎస్ మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ బీజేపీకి దగ్గరవుతుండడం పట్ల ఆ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన దిశగా వెళుతున్నారని, మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఉద్యమకారుల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల భవిష్యత్ రెండూ బీజేపీతోనే నిలబడతాయనేది స్పష్టమైన నిజం అని విజయశాంతి అన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా బీజేపీకి మాత్రమే ఉందనేది తిరుగులేని వాస్తవం అని అభివర్ణించారు. కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతారన్న భావం తెలంగాణ ప్రజల్లో ఇప్పటికే పూర్తిగా నిరూపితమైందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement