Saturday, May 11, 2024

‘కాకా’కి కోపం వ‌చ్చే.. ఈట‌ల‌పై కేక‌లేసిండు…

ఖమ్మం నగరం : బిజెపి నాయకులు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు (వి హెచ్) ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటల చేసిన ఆరోపణలు ఖండిస్తూ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో మాట్లాడుతూ… ఈటేల బీజేపి చేసిన తప్పును కప్పి పుచ్చే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యలను వదిలేసి కాంగ్రెస్ పై నిరాదరా అరోపణపలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజెపి ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికార పార్టీలో ఉన్న రాజేందర్ రాష్ట్రంలో కే సీ ఆర్ అవినీతి పై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.

ఏ అధికారం లేకపోయినా సీఎం కే సీ ఆర్ పై కేసులు పెట్టిన దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. అలాంటి వ్యక్తి పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడాలని సవాల్ విసిరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వా ళ్ళ దుర్గా ప్రసాద్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, పీసీసీ సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్, మాజీ ఏమ్మెల్సి పోట్ల నాగేశ్వరావు , బెల్లం శ్రీనివాసరావు, జ్ఞానేశ్వర్, కొత్త సీతారాములు, బొడ్డు బొందయ్య, బేహెచ్ రబ్బానీ, మలీదు వెంకటేశ్వర్లు, సైదులు నాయక్, కిరణ్ కుమార్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement