Wednesday, May 15, 2024

వ్యాక్సినేషన్ వంద‌శాతం పూర్తి : గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై హ‌ర్షం

తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి డోసు వ్యాక్సినేష‌న్ వంద శాతం పూర్తి కావ‌డంపై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ హ‌ర్షం వ్యక్తం చేశారు. అలాగే టీకా వేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్ర‌జ‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ అభినంద‌న‌లు తెలిపారు. అలాగే వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావును కూడా ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శంసించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంతో పాటు మ‌రో 7 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా మొద‌టి డోసు వంద శాతం పూర్త‌యిన సంద‌ర్భంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement