Thursday, April 25, 2024

అకాల వర్షం.. నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీవ్ర పంట నష్టాలకు గురైన ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలించి, రైతులకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారాన్ని అందిస్తామన్నారు. తొర్రూరు మండలంలోని మడిపల్లి, చంద్రు తండా, మాటేడు, పోలేపల్లి తదితర గ్రామాల్లో మామిడి తోటలు, మొక్కజొన్న పంట నిరాశ్రయులైన ప్రజలను కలిశారు. వడ్డే కొత్తపల్లి, పెద్ద వంగర, చిన్న వంగర, తదితర గ్రామాల్లో ప్రజల బాగోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement