Wednesday, April 24, 2024

లారీని ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి

లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు దుర్మ‌ర‌ణం చెందారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా మృతుల్లో తొమ్మిది ఏళ్ల చిన్నారి, నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం తొమ్మది మంది ప్రయాణిస్తున్నారని.. వారిలో ఆరుగురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. మృతులను నామక్కల్ జిల్లాకు చెందిన కె ముత్తుసామి, ఆర్‌ తిరుమూర్తి, సేలం జిల్లాకు చెందిన పి అనంతయి, జీ ధావనశ్రీ, సంతోష్ కుమార్‌తో పాటు మురుగేశన్‌‌లుగా గుర్తించారు.

సేలం జిల్లా నుండి కుంభకోణంలోని ఆలయానికి తొమ్మిది మంది వ్యక్తులు కారులో వెళుతుండగా తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ సంతోష్ కుమార్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో.. లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ సంతోష్‌తో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని తిరుచ్చిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుచ్చి పోలీస్ సూపరింటెండెంట్ సుజిత్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement